ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 17 నవంబరు 2017 (12:17 IST)

భర్త డబ్బులు చెల్లించలేదనీ భార్య పైటకొంగుబట్టి లాగిన వ్యాపారి!

కొందరు వ్యాపారుల ఆగడాలు నానాటికీ శృతిమించిపోతున్నాయి. భర్త తీసుకున్న బాకీ చెల్లించలేదన్న అక్కసుతో భార్య పైటకొంగుపట్టిలాగడమే కాకుండా ఆమెన చెరబట్టాడో వ్యాపారి. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడలో

కొందరు వ్యాపారుల ఆగడాలు నానాటికీ శృతిమించిపోతున్నాయి. భర్త తీసుకున్న బాకీ చెల్లించలేదన్న అక్కసుతో భార్య పైటకొంగుపట్టిలాగడమే కాకుండా ఆమెన చెరబట్టాడో వ్యాపారి. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నందిగామకు చెందిన సింగిరికొండ మోహన్ రావు, మిర్యాలగూడకు చెందిన కనపర్తి సత్యప్రసాద్‌లు కలిసి కొంత పెట్టుబడితో వ్యాపారాలు ప్రారంభించారు. తర్వాత గొడవలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. అయితే, తనకు రావాల్సిన డబ్బు ఇవ్వాలని మోహన్ రావుపై సత్యప్రసాద్ ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలో ఓ కోర్టు కేసు నిమిత్తం మిర్యాలగూడకు వచ్చిన మోహన్ రావు దంపతులను డబ్బు కోసం సత్యప్రసాద్ గృహనిర్బంధం చేశాడు. మూడు రోజుల తర్వాత డబ్బు తేవాలని బెదిరిస్తూ, మోహన్ రావును మాత్రం వదిలి, అతని భార్యను మాత్రం తనవద్దే ఉంచుకున్నాడు. 
 
ఆ తర్వాత సత్యప్రసాద్ ఆమెను బెదిరించి ఇంటి పనులు చేయించుకోసాడు. ఈ క్రమంలో నందిగామ వెళ్లిన మోహన్ రావు, తనకు భార్యతో కలిపి జాయింట్ ఖాతా ఉందని, ఆమె కూడా వస్తేనే డబ్బు తెచ్చే వీలవుతుందని చెప్పడంతో, ఆమెను తీసుకుని నందిగామ వెళ్లారు. ఎలాగోలా సత్యప్రసాద్ నుంచి తప్పించుకున్న ఆ జంట, నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.