హీరో సాయికుమార్ తండ్రి పీజే శర్మ కన్నుమూత!
డైలాగ్ కింగ్, హీరో సాయికుమార్ తండ్రి పీజే శర్మ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూసినట్టు తెలుస్తోంది.
శనివారం జరిగిన తన మనవడు, సాయికుమార్ కుమారుడు, యువ హీరో ఆది వివాహ వేడుకల్లో పీజే శర్మ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పెళ్లి వేడుకలు ముగిసీముగియగానే తండ్రి మరణించడంతో సాయికుమార్ ఇంట విషాద వాతావరణం నెలకొంది.
పీ.జే శర్మ మృతిపట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సానుభూతి తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎర్రగడ్డ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.