గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?
14 సంవత్సరాల తర్వాత సినిమా అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అందులో ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్ సినిమాలకే అగ్ర పీఠం వేశారు. ఒక దశలో ఆయా సినిమాలను చూడకుండానే అవార్డు కమిటీ ఎంపిక చేసింది. అవార్డు కమిటీలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పాతకాలం జర్నలిస్టులు వున్నారు. ఇదిలా వుండగా, అసలు తెలంగాణ సినిమాకు సరైన గుర్తింపు దక్కలేదని ఇప్పటికే పలువురు దర్శకులు వాపోయారు.
రజాకార్ అనే సినిమాను గత ఏడాది తీసినందుకు ఆ చిత్రంలో ఆర్ట్ డిపార్ట్ మెంట్ కు రావాల్సిన గుర్తింపు సరిగ్గా రాలేదు. మరో ఆంధ్ర సినిమాకు వచ్చింది. ఇలా పలు శాఖలలో తమకు అన్యాయం జరిగింది. తెలంగాణ ఫిలిండెవలప్ మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడు ద్రుష్టికి తీసుకు వచ్చినా లాభంలేకపోయింది. ఎదుకంటే ఆయనా అగ్ర నిర్మాతే కావడం వల్లే తమ విన్నపం సరిగ్గా కార్యరూపం రాల్చలేదని తెలుస్తోంది.
ఇక నిన్న రాత్రి టి.ఎఫ్.డి.సి. ఛైర్మన్ హోదాలో దిల్ రాజు మాట్లాడుతూ, 14 ఏల్ళ నుంచి తెలంగాణలో అవార్డులు ఇవ్వలేదని ఇప్పుడు ఇవ్వడం మంచి పరిణామం అంటూ.. శనివారం హైటెక్స్ నోవాటెల్ లో గ్రాండ్ గా జరుగుతుందని తెలిపారు. తన సినిమాల్లో తెలంగాణ వారికే ప్రాధాన్యత ఇచ్చే ఆ నిర్మాత అవార్డు విషయంలో ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నారో అర్థంకాలేదు.
ఇక రేవంత్ రెడ్డి చుట్టుపక్కల వారు కూడా ప్రాంతీయాభిమానం మక్కువ. ఆమధ్య జర్నలిస్టుల సమావేశం జరిగినప్పుడు ఆంద్ర వారి వల్ల తమకు ఇండ్ల స్థలాలు రావడంలేదనీ వాపోయారు. దాదాపు 18 ఏళ్ళ నాడు ఉమ్మడి రాష్ట్రం వున్నప్పుడు అందరికీ రావాల్సిన స్థలాలను కొందరు ప్రత్యేకంగా ప్రాంతీయవాదం ముందుకు తెచ్చి కోర్టులో కేసు కూడా వేసినట్లు తెలిసింది. అలాంటిది గద్దర్ అవార్డులో ఎందుకు మౌనం వహించారనేది సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.