బ్లాక్ మనీ గురించి చెబితే 7 కోట్లు బొక్క... ఇక పూరీతో మహేష్ బాబు జనగణమనేనా...?
బ్లాక్ మనీ నేపథ్యంలో తీసిన సినిమా 'ఇజం'. నందమూరి కళ్యాణ్ రామ్... పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా బ్యాక్డ్రాప్ నల్లధనం.. దాన్ని విదేశాల నుంచి బయటకు తెస్తే ఎలా వుంటుందనే పాయింట్తో సినిమా తీశాడు. ఈ సినిమా విడుదలైన నాటి
బ్లాక్ మనీ నేపథ్యంలో తీసిన సినిమా 'ఇజం'. నందమూరి కళ్యాణ్ రామ్... పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా బ్యాక్డ్రాప్ నల్లధనం.. దాన్ని విదేశాల నుంచి బయటకు తెస్తే ఎలా వుంటుందనే పాయింట్తో సినిమా తీశాడు. ఈ సినిమా విడుదలైన నాటి నుంచి డివైడ్ టాక్ వచ్చింది. ఇప్పటికే ఈ కాన్సెప్ట్ పైన విక్రమ్ 'మల్లన్న', రజనీకాంత్ 'శివాజీ' చిత్రాలు వచ్చేశాయి.
బ్లాక్ మనీ వంటి పాయింట్ను తీసుకుని ఎంటర్టైన్ జోడిస్తే బాగుండేది. కానీ పూరీ సీరియస్గా సినిమా తీసి దెబ్బయిపోయాడనే వార్తలు విన్పిస్తున్నాయి. అంతకుముందు కూడా జ్యోతిలక్ష్మి పేరుతో సినిమా తీశాడు. అదీ ఫెయిల్ అయింది. కానీ.. కళ్యాణ్ రామ్తో తీసిన ఇజం మాత్రం దాదాపు 7 కోట్ల డెఫిషిట్ను చవిచూసిందని ఫిలింనగర్ వర్గాలు తెలియజేస్తున్నాయి. వసూళ్ళ పరంగా ఆశాజనకంగా లేకపోవడం ప్రధాన కారణం. మరో మూడు రోజుల్లో నాలుగు సినిమాలు విడుదలకానున్నాయి. దాంతో ఇజంకు సంబంధించి చాలా థియేటర్లు లేచిపోనున్నాయి.