కొరటాల వర్సెస్ దిల్రాజు
siva, raju
ఇప్పుడు ఆచార్య సినిమా గురించి ఆ ఫ్రీడం కొరటాలకే రామ్చరణ్, చిరంజీవి ఇచ్చినట్లు గత కొద్దిరోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీన్ని ఆసరాగా తీసుకున్న కొరటాల నైజాం రైట్స్ను దిల్రాజుకు కాకుండా వేరేవారికి ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో మహేష్బాబు సినిమా భరత్ అనే నేను సినిమా కూడా దిల్ రాజకు ఇప్పించారు కొరటాల. కానీ ఆ తర్వాత అది పెద్దగా ఆశాజనంగా ఆడకపోవడంతోపాటు ఆశించినంత రాబడి రాలేదని తెలిసింది. కానీ ఇప్పుడు దిల్రాజును కాదని వేరే వారికి ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. బహుశా ఎక్కడో ఏదో తేడా జరిగినట్లు తెలుస్తుంది. కనుక ఆచార్య సినిమా విడుదలకు ముందు ఏదైనా జరగవచ్చని ఫిలింనగర్ కథనాలు చెబుతున్నాయి. కరోనా వల్ల ఆచార్య సినిమా షూటింగ్ వాయిదా పడింది. మరి రిలీజ్ కూడా అనుకున్న టైంకు లేట్గా అయ్యే అవకాశాలున్నాయి.
తర్వాతి కథనం
