"ఎమ్మెస్ ధోనీ: ది అన్టోల్డ్ స్టోరీ" ఆడియో రిలీజ్కు చీఫ్ గెస్ట్గా ధోనీ.. స్పెషల్ గెస్ట్గా రాజమౌళి
జార్ఖండ్ డైనమైట్ ఎమ్మెస్ ధోనీ జీవిత నేపథ్యంతో "ఎమ్మెస్ ధోనీ: ది అన్టోల్డ్ స్టోరీ" అనే మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. నీరజ్ పాండే తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ భాషలలో వి
జార్ఖండ్ డైనమైట్ ఎమ్మెస్ ధోనీ జీవిత నేపథ్యంతో "ఎమ్మెస్ ధోనీ: ది అన్టోల్డ్ స్టోరీ" అనే మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. నీరజ్ పాండే తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదలకు సిద్ధంగా ఉంది. మార్కెట్లో రిలీజ్కు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. రూ.80 కోట్లతో తీసిన ఈ సినిమా విడుదల కాకముందే రూ.60 కోట్లు సంపాదించింది. ఈ మూవీ శాటిలైట్ హక్కుల ద్వారా రూ.45 కోట్లు రాగా.. బ్రాండింగ్లో రూ.15 కోట్లు వచ్చాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రంలో సుషాంత్ రాజ్ పుత్ ధోనీ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా సహజంగా కనిపించేందుకు కొన్ని రియల్ లొకేషన్లలో చిత్రీకరించారు. రాంచీలోని ధోనీ ఇల్లు, స్కూలు, ఖరగ్పూర్లో ధోనీ టీటీగా చేసిన రైల్వే స్టేషన్లలో చిత్రీకరించారు. ''ఎమ్మెస్ ధోనీ: ది అన్టోల్డ్ స్టోరీ'' పేరుతో ఈ సినిమా ట్రైలర్స్కు మంచి స్పందన వస్తోంది. మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉండగా యూనిట్ కూడా వెరైటీ ప్రమోషన్స్తో ఆడియన్స్లో హైప్ తెస్తుంది.
ఈనెల 24న తెలుగులో ఈ చిత్రానికి సంబంధించి ఆడియో వేడుక జరగనుంది. ఈ ఆడియో లాంఛ్కి టీమిండియా వన్డే కెప్టెన్ ధోనీ చీఫ్ గెస్ట్గా హాజరుకానుండగా, దర్శక ధీరుడు రాజమౌళి కూడా స్పెషల్ గెస్ట్గా హాజరు కానున్నాడు. ఇప్పటికే ఓ ప్రముఖ ఛానెల్ ఆడియో వేడుకకి సంబంధించిన టిక్కెట్స్ని పంపిణీ చేస్తుంది.