శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 మే 2020 (16:58 IST)

ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్.. ఊపేస్తున్న జిగేల్ రాణి!! (video)

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇపుడు టాప్ రేంజ్‌లో దూసుకునిపోతున్న హీరోయిన్న ఎవరయ్యా అంటే.. ఠక్కున చెప్పే పేరు జిగేల్ రాణి అలియాస్ పూజా హెగ్డే. ఇపుడు ఈ అమ్మడు పట్టిందల్లా బంగారంగా మారిపోతోంది. అంటే.. పూజా నటించే ప్రతి చిత్రం సూపర్ హిట్ అవుతోంది. దీంతో దర్శక నిర్మాతలు ఈ అమ్మడు కోసం క్యూకడుతున్నారు. ఇది టాలీవుడ్‌లో పరిస్థితి. మరోవైపు, అటు బాలీవుడ్‌లోనూ ఈ అమ్మడు దూసుకునిపోతోంది. 
 
నిజానికి ఈ అమ్మడు ఖాతాలో వరుస హిట్లు పడుతున్నాయి. దీంతో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ వచ్చేసింది. గ్లామర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. ఇదే అదునుగా భావించిన ఈ ముద్దుగుమ్మ పారితోషికాన్ని అమాంతం పెంచేసింది. అయినప్పటికీ, పూజానే కావాలంటూ దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. 
 
ఈ క్రమంలో అటు తెలుగులోనూ, ఇటు హిందీలోనూ పలు చిత్రాల్లో నటించేందుకు కమిట్ అవుతోంది. హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందే 'కబీ ఈద్ కబీ దివాలీ' సినిమాలోను, అక్షయ్ కుమార్ నటించే 'బచ్చన్ పాండే' చిత్రంలోనూ హీరోయిన్‌గా నటించడానికి పూజ ఇప్పటికే డేట్స్ ఇచ్చేసింది.
 
ఇకపోతే, ఇటు తెలుగులో కూడా పలు ప్రాజెక్టుల్లో కమిట్ అయింది. ముఖ్యంగా, హీరో ప్రభాస్ చిత్రంలోనూ, 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా మలయాళ యువ హీరో దుల్ఖర్ సల్మాన్ సరసన హీరోయిన్‌గా నటించడానికి ఓకే చెప్పింది. 
 
హను రాఘవపూడి దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని అశ్వనీదత్ కూతుర్లు స్వప్నా దత్, ప్రియాంక దత్ కలసి నిర్మిస్తారు. ఇలా ఈ జిగేల్ రాణి అటు బాలీవుడ్.. ఇటు టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉందన్నమాట!