కీలక సన్నివేశాల చిత్రీకరణలో రామ్ చరణ్ ధృవ
రామ్చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కిస్తున్న ‘ధృవ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమ
రామ్చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కిస్తున్న ‘ధృవ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అరవింద్ స్వామి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
చరణ్.. రకుల్ .. అరవింద్ స్వామి తదితరులు పాల్గొనగా కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సీన్స్ ఇంటర్వెల్కి ముందు వస్తాయని దర్శక నిర్మాతలు అంటున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసమే చరణ్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడనీ.. ఈ సీన్స్ ఈ సినిమా హైలైట్స్లో ఒకటిగా నిలుస్తాయని అంటున్నారు. ఈ సినిమాలో చరణ్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడనే సంగతి తెలిసిందే. డిసెంబర్లో విడుదల కానుందనే వార్తలు వెలువడుతోన్న నేపథ్యంలో, ఆ సమయం కోసం చరణ్ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.