1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 28 జూన్ 2024 (20:22 IST)

డబ్బు కోసం అనసూయ ఏదైనా చేస్తుందా? ఇలాంటి షోలకి అడ్డుకట్టే వేసేవారు లేరా?

Anasuya expose
Anasuya expose
జబర్ దస్త్ లో మగవారే ఆడవాళ్ళు గెటప్ తో వచ్చాయి. రానురాను జుగుప్సాకరంగా తయారైంది. ఆ టైంలో నాగబాబు, రోజా కూడా భుజాన మోసారు కూడా. ఆ తర్వాత వీటిపై ట్రాన్స్ జెండర్ కూడా తమ మనోభావాలు దెబ్బతినేలా చేస్తున్నారని వాపోయారు కూడా. డబుల్ మీనింగ్ డైలాగ్ లు, భార్యా భర్తలు ఎఫైర్స్, కుళ్ళుతో వున్న స్కిట్ లను రాసుకుని అదే టీవీ ప్రేక్షకులపై బలవంతంగా రుద్దుతున్నారు. దానితోపాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా తోడయింది. 
 
ప్రముఖ ఛానల్ వీటిని ఎంకరేజ్ చేయడంతో పలువురు మండిపడ్డా. ఆ ఛానల్ కూడా ఎటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేకపోయింది. ప్రపంచంలో జరిగే వార్తల విశేషాలు చూడకుండా ఇంట్లోని వారంతా జబర్ దస్త్ వంటిదానికి బానిసలుగా మారిపోయారు. ప్రపంచం మంతా అభివ్రుద్ధి పథంలో నడుస్తుండగా మన తెలుగు టీవీ రంగం మాత్రం దారుణంగా తయారైంది. 
 
2010 లోనే ఢిల్లీలోనే ఓ సంస్థ ఇలాంటి ప్రోగ్రామ్ లపైనా కేసు కూడా వేసింది. టీనేజ్ లో వున్న పిల్లలు ఇలాంటివి చూడడంతో వారి బాడీపై హార్ మోన్ ల ప్రభావం చూపుతాయి. లేడీస్ త్వరగా మెచ్చూర్డ్ అవుతారని, రకరకాల పోకడలు జరుగుతాయని తెలిపింది.
 
ఆ తర్వాత కౌన్ బనేగా కరోడ్ పతి  వంటి ప్రోగ్రామ్ కొంచెం అడ్డుకట్టవేసింది. ఆ తర్వాత మరలా మామూలే అయింది. అందుకే ఇలాంటి ప్రోగ్రామ్ లపై తక్షణమే తగిన చర్యలు ప్రభుత్వంపరంగా టీవీ యాజమాన్యంపై తీసుకోవాలని ప్రముఖ సామాజిక వేత్త క్రిష్ణ కుమారి తెలియజేస్తున్నారు.
 
ఇక పోతే అసలు విషయానికి వస్తే, ఇటీవలే టీవీలో వచ్చే కొత్త ఫో లో మిరపకాయలు తింటూ ఆ తర్వాత స్టేజీపై వున్న డాన్స్ మాస్టర్ ను అనసూయ ముద్దు పెట్టుకోవడం జరిగింది. ఇలా చేయడం కరెక్టేనా? అసలు సభ్యసమాజానికి ఏం చెప్పదలిచారని క్రిష్ణ కుమారి మండిపడింది. అందుకే ఇలాంటి సభ్యతలేని షోలు బుల్లితెరపై చెక్ పెట్టాలని సూచిస్తున్నారు. ఇలాంటి పిల్లలపై తీవ్రప్రభావాన్ని చూపుతాయని మండి పడింది .అందుకే సినిమాలమల్లే బుల్లితెరకూ సెన్సార్ వుండాలని తెలియజేస్తున్నారు.