శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 6 ఏప్రియల్ 2022 (17:56 IST)

కోడి పందేల నేప‌థ్యంలో బ‌రి చిత్రం

Bari, Raja, Sahana, Munikrishna CV, Geetakrishna, Suresh Reddy, Veera Shankar,
Bari, Raja, Sahana, Munikrishna CV, Geetakrishna, Suresh Reddy, Veera Shankar,
రాజా, స‌హాన జంట‌గా రూపొందిన చిత్రం `బ‌రి`. మునికృష్ణ సి.వి, గీతాకృష్ణ నిర్మాత‌లు. సురేష్ రెడ్డి ద‌ర్శ‌కుడు. ఈ నెల 8న గ్రాండ్‌గా రిలీజ‌వుతోన్న ఈ చిత్రం ట్రైల‌ర్ ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో ఆవిష్క‌రించారు.
ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వీర శంక‌ర్ మాట్లాడుతూ...`` కోడి పందేల నేప‌థ్యంలో రూపొందిన `బ‌రి` ట్రైల‌ర్  క‌మ‌ర్షియ‌ల్‌గా ఎంతో ఎమోష‌న‌ల్‌గా ఉంది.  ట్రైల‌ర్‌ని  బ‌ట్టి ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ ఏంటో అర్థ‌మవుతోంది. నిర్మాత కూడా ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా గ్రాండ్ గా తెర‌కెక్కించారు. కెమెరా వ‌ర్క్, సంగీతం ఆక‌ట్టుకునే విధంగా ఉన్నాయి.  ఈ నెల 8న విడుద‌ల‌వుతోన్న ఈ చిత్రం స‌క్సెస్ సాధించి టీమ్ అంద‌రికీ మంచి పేరు రావాల‌న్నారు.
నిర్మాత మునికృష్ణ సి.వి మాట్లాడుతూ, మా ద‌ర్శ‌కుడు సురేష్  రెడ్డి మంచి ప్లానింగ్‌తో సినిమాను ఆక‌ట్టుకునే విధంగా తెర‌కెక్కించారు. ఈ నెల 8న సినిమాను గ్రాండ్ గా రిలీజ్  చేస్తున్నాం. తెలంగాణ‌, ఆంధ్ర ప్రేక్ష‌కులు మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా`` అన్నారు.
 
చిత్ర ద‌ర్శ‌కుడు సురేష్ రెడ్డి మాట్లాడుతూ, మా నిర్మాత పూర్తి స‌హ‌కారం వ‌ల్ల సినిమాను క్వాలిటీతో తెర‌కెక్కించ‌గ‌లిగాను. పూర్తి స్థాయిలో  కోడి పందేల నేప‌థ్యంలో జ‌రిగే ప‌క్కా విలేజ్ స్టోరి ఇది.  ఈ నేప‌థ్యంలో గ‌తంలో సినిమాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ  ఇది పూర్తిగా  డిఫ‌రెంట్‌గా ఉంటుంది.  మా హీరో హీరోయిన్స్ నేను డిజైన్ చేసుకున్న పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం చేశారు. మా  చిత్రాన్ని పెద్ద స‌క్సెస్ చేస్తార‌ని కోరుకుంటున్నాం అన్నారు.
హీరోయిన్ స‌హాన మాట్లాడుతూ...``మా పేరెంట్స్ వ‌ల్ల నేను హీరోయిన్‌గా న‌టించాల‌న్న కోరిక ఈ సినిమాతో నెర‌వేరింది. డైర‌క్ట‌ర్ సురేష్ గారు అంద‌రికీ న‌చ్చేలా సినిమా తీశారు. మా సినిమాను గ్రాండ్ స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నా`` అన్నారు.
హీరో రాజా మాట్లాడుతూ, ఈ చిత్రంలో హీరోగా న‌టించే అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క నిర్మాత‌లకు  ధ‌న్య‌వాదాలు.  మా నిర్మాత‌లు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా మా మీద ఎంతో బ‌డ్జెట్ పెట్టారు. హీరోయిన్ గా స‌హాన మంచి స‌పోర్ట్ ఇచ్చింద‌న్నారు. ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో సావిత్రి, సునీత మ‌నోహ‌ర్‌,  అరుణ్‌, శ్రీకృష్ణ‌,  త‌దిత‌రులు పాల్గొన్నారు.