1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 14 మార్చి 2022 (12:10 IST)

ప్రభాస్ మేజిక్కా? పూజా హెగ్డే కిక్కా? ఒకసారి చూద్దాంలే అని రాధేశ్యామ్‌కి వెళ్తున్నారట, రెండు రోజుల్లో రూ.119 కోట్లు

రాధేశ్యామ్ చిత్రం మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంపై భిన్నంగా స్పందనలు వచ్చాయి. ఐతే ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ ప్రేమ కథ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ నమోదు చేసి ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతోంది.

 
కేవలం రెండు రోజుల్లోనే రూ.119 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్‌ వైపు లాగుతోంది. ఒకసారి చూద్దాంలే అని చాలామంది ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసేందుకు వెళుతున్నారట. దీనికి ప్రభాస్ మేజిక్కా? పూజా హెగ్డే కిక్కా? అని మాట్లాడుకుంటున్నారు టాలీవుడ్ సినీజనం.

బహుశా రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ మార్చి 25న విడుదలయ్యేవరకూ జనం రాధే శ్యామ్ చిత్రాన్ని ఒకసారి చూద్దాంలే అంటూ నాలుగైదు చూస్తారేమో... మొత్తానికి ప్రభాస్-పూజా హెగ్డే జంట తమదైన మెస్మరైజింగ్ ఫార్ములా చేసారని అంటున్నారు.