మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : శుక్రవారం, 21 అక్టోబరు 2016 (19:00 IST)

రాంచరణ్ 'ధ్రువ' ఆడియో రిలీజ్‌కు చీఫ్‌‌గెస్ట్‌గా పవన్‌ కళ్యాణ్‌

రాంచరణ్ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో 'ధ్రువ' చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఇటీవల విడుదల చేయగా, ఈ టీజర్‌ మూడు మిలియన్‌ మార్క్‌ను క్రాస్‌ చేసి క్రేజ్‌ సం

రాంచరణ్ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో 'ధ్రువ' చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఇటీవల విడుదల చేయగా, ఈ టీజర్‌ మూడు మిలియన్‌ మార్క్‌ను క్రాస్‌ చేసి క్రేజ్‌ సంపాదించింది. ఆ ఉత్సాహంతో ఈ సినిమా టీమ్‌ ఆడియోను రిలీజ్‌ చేయడానికి రెడీ అవుతోంది. 
 
నవంబర్‌ 20వ తేదీన ఘనంగా ఈ వేడుకను జరపనున్నారు. ఈ ఫంక్షన్‌కి పవన్‌ ముఖ్య అతిథిగా రానున్నాడనే టాక్‌ వినిపిస్తోంది. అదే నిజమైతే మెగా అభిమానులకు అంతకుమించిన ఆనందం లేదు. రకుల్‌ కథానాయికగా అరవింద్‌ స్వామి విలన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను, డిసెంబర్‌ 2వ తేదీన విడుదల చేయనున్నారు.