1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2023 (17:40 IST)

ఆయన పర్ఫెక్ట్ జెంటిల్మన్ : దర్శకుడు ప్రదీప్ మద్దాలి

Director Pradeep Maddali, bvs ravi
Director Pradeep Maddali, bvs ravi
సక్సెస్, ఫెయిల్యూర్ ని ఎలా తీసుకోవాలి, హీరో దగ్గిర నుండి లైట్ బాయ్ వరకు అందరినీ ఒకేలా చూసేవారు ఆయన. ఇలాంటి లైఫ్ లెసన్స్ ఎన్నో నేర్చుకోవచ్చు. ఆయన పర్ఫెక్ట్ జెంటిల్మన్ అని పూరి జగన్నాథ్ గురించి దర్శకుడు ప్రదీప్ మద్దాలి అన్నారు. 
 
సత్య దేవ్ హీరోగా '47 డేస్' అనే థ్రిల్లర్ ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన ప్రదీప్ మద్దాలి తన రెండో ప్రాజెక్ట్ గా 'సర్వం శక్తి మయం' అనే సిరీస్ కి దర్శకత్వం వహించారు. దీనికి కథను అందించిన బి వి ఎస్ రవి క్రియేటర్ గ వ్యవహరిస్తే, ప్రదీప్ మద్దాలి డైరెక్ట్ చేసారు. ఆహా లో విడుదల అయిన ఈ 10 ఎపిసోడ్ల సిరీస్ శక్తి పీఠాలు, హిందూ మతం లోని విశిష్ఠతను తెలియజేసే విధంగా ఆసక్తికరంగా రూపుదిద్దుకుంది. దసరా సందర్భంగా విడుదలైన సర్వం శక్తి మయం విశేష ఆదరణతో ఓ టి టి లో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రదీప్ మద్దాలి తన సంతోషాన్ని, అనుభవాలను పంచుకున్నారు....
 
- మాది రాజమండ్రి. నేను ఇంజినీరింగ్ అక్కడే చేశాను. ఆ తర్వాత ఐదేళ్లు ఐటి లో సి ఎస్ సి లో టీం లీడ్ గా పని చేశాను. తర్వాత నేను రామ్ గోపాల్ వర్మ గారితో, పూరి జగన్నాధ్ గారితో పరిచయం అయ్యాక నేను పూరి గారి దగ్గిర ఐదేళ్లు పనిచేసాను. తర్వాత 47 డేస్ తో దర్శకుడిగా మారాను.
 
'సర్వం శక్తి మయం' లాంటి సబ్జెక్టు చేయడం చాలా పెద్ద బాధ్యత. నాకు బి వి ఎస్ రవి బాగా పరిచయం. అయన ఏమన్నా ప్రాజెక్ట్స్ ని డిస్కస్ చేయడానికి పిలిచేవారు. సర్వం శక్తి మయం కి బి వి ఎస్ రవి గారు క్రియేటర్, రైటర్. ఆయన ఈ ఐడియా చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. చాలా మంచి అవకాశం అని వెంటనే చేస్తాను అన్నాను. 
 
- నేను పూరి గారి దగ్గిర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పటి నుండీ ఆయన నన్ను చూస్తున్నారు. మధ్యలో చాలా ప్రాజెక్ట్స్ అనుకున్నాం. ఆయన ఈ ఐడియా వచ్చిన వెంటనే దాన్ని పట్టుకుని ఆయనకీ వెర్షన్స్ ఇచ్చేవాడిని. అందుకనే ప్రదీప్ ఇది చేయగలడు అని నమ్మకం వచ్చుండొచ్చు.
 
రామ్ గోపాల్ వర్మ, పూరి, రవివీళ్ళ ముగ్గురిలో ఒక సిమిలర్ క్వాలిటీ ఉంది. వారు వారి దారుల్లో ఉన్నా, కామన్ పాయింట్ ఏంటి అంటే థె అర్ రెబెల్ ఇన్ థేయిర్ ఒన్ వేస్ 
 
- ఫస్ట్ షెడ్యూల్ మంచి సమ్మర్ లో స్టార్ట్ చేసాము. 18-20 రోజుల షెడ్యూల్ ఒరిస్సా నుండి కాశ్మీర్ వరకు ప్లాన్ చేసుకున్నాం. ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా అనుకున్న టైం లో పూర్తి చేసుకున్నాం. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అనుకున్నది అనుకున్నట్టు చేయడం పెద్ద మిరకిల్. మా నిర్మాతలు విజయ్ గారు, అంకిత్ గారు, కౌముది గార్లని అభినందించాలి. ముందుగా ఏ ఓ టి టి తో టై అప్ అవకుండా అవసరమైనంత ఖర్చు పెడుతూ ప్యాషన్ తో చేశారు. ప్రాజెక్ట్ అంతా ఎగ్జిక్యూట్ చేసాక ఓ టి టి కి వెళ్లాం. ఇది పెద్ద మిరకిల్ అనుకుంటాను.
 
చాలా వరకు హిందీ యాక్టర్స్ ఏ ఉన్నారు ? ఎందుకని ఆ కాస్టింగ్ కి వెళ్లారు ?
 
- శక్తీ పీఠాల గురించి చేస్తున్నప్పుడు చిన్న మిస్ కమ్యూనికేషన్ జరిగినా ఎన్నో విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అందుకే రీసెర్చ్ రవి గారూ, సిరా శ్రీ గారు వారితో పాటూ నేనూ డిస్కషన్ లో ఉండి స్క్రిప్ట్ రెడీ చేశాం. పేపర్ మీదనే చాలా లాజికల్ గా, రీజనింగ్ గా వచ్చింది. అలాంటి ఇబ్బంది ఎక్కడా రాలేదు.
 
- అమ్మవారి శక్తి పీఠాల కథ ఇందులో చెప్పాము. దక్ష యజ్ఞం జరుగుతున్నప్పుడు సతీ దేవి తండ్రి, తన భర్త శివుడిని పిలవకుండా అవమానించినందుకు అవమాన భారంతో అదే హోమగుండంలో ఆవిడ ఆత్మాహుతి చేసుకున్నప్పుడు కోపం తో ఉన్న శివుడిని శాంతపరచడానికి శ్రీ మహావిష్ణువు ని ప్రాధేయపడితే, అమ్మవారి శరీరాన్ని ఖండించినప్పుడు ఆ శరీర భాగాలు పడ్డ ప్రాంతాలని మనం శక్తీ పీఠాలుగా కొలుస్తాం. రచయిత తోట ప్రసాద్ గారు నాతో అష్టాదశ శక్తిపీఠాలని శక్తిమంతమైనవిగా చెప్పారు. శరీర భాగాలతో పాటూ, ఆ రక్తం తో తడిచిన నేల అమ్మవారి శక్తితో నిండి ఉంది. అందుకే భారత దేశం గొప్పది అయింది. ఇది నమ్మకం మీద ఆధారపడి ఉండే అంశం. 
 
- జీ 5 లో హిందీ లో జూన్ 9న రిలీజ్ అయింది. టెర్రిఫిక్ రెస్పాన్స్ ఉంది. అహా లో తెలుగు, తమిళ్ లో అక్టోబర్ 20న విడుదల అయింది. చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. దేశం నలువైపుల నుండీ వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీ గా ఉంది. రెగ్యులర్ క్రైమ్, థ్రిల్లర్ జానర్ కాదు కాబట్టి పోను పోను ఎంతో మందికి రీచ్ అవుతుంది ఇంకా ఇంకా మాట్లాడుకుంటారు. ఎంతో మంచి స్పందన చూపిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.