1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (17:11 IST)

ఏడు గంటల పాటు రకుల్‌ను విచారించిన ఈడీ

టాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ విచారణ కాసేపటి క్రితమే ముగిసింది. ఉదయం నుంచి దాదాపు ఏడు గంటలు పాటు సుదీర్ఘంగా విచారణ చేశారు ఈడీ అధికారులు. ఈ సందర్భంగా హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ బ్యాంక్ లావాదేవీలపై ప్రశ్నించారు ఈడీ అధికారులు.
 
అంతేకాదు… 30 ప్రశ్నలకు హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ నుండి సమాచారం రాబట్టారు ఈడీ అధికారులు. ఎప్పుడు విచారణకు హాజరు కావాలని ఆదేశించిన విచారణకు రావాలని రకుల్‌కు చెప్పిన అధికారులు… కెల్విన్‌తో సంబంధాలు, రియా చక్రవర్తితో హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్‌పై విచారణ‌లో అడిగారు ఈడీ అధికారులు. 
 
మూడు బ్యాంక్ అకౌంట్లు రకుల్ నుండి క్లారిటీ తీసుకుంది ఈడీ. 13 తేదీన క్లబ్ మేనేజర్, నవదీప్ విచారణ తరువాత రకూల్ వ్యవహారంపై క్లారిటీకి రానున్నారు ఈడీ అధికారులు.