గౌతమీపుత్ర శాతకర్ణి: బాలకృష్ణతో రొమాన్స్ చేయనున్న శ్రియా చరణ్!
నందమూరి హీరో బాలకృష్ణ-క్రిష్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాకు హీరోయిన్ ఖరారైనట్లు సినీ వర్గాల సమాచారం. బాలయ్య సరసన ముందుగా నయనతారను అనుకున్నా.. ఆమె బిజీ కాల్షీట్ల కారణంగా శ్రియా చరణ్ను శాతకర్ణికి హీరోయిన్గా తీసుకున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్.
బాలకృష్ణ సరసన చెన్నకేశవ రెడ్డి సినిమాలో లీడ్ రోల్ చేసిన శ్రియా చరణ్.. చాలా సంవత్సరాల గ్యాప్కు తర్వాత తిరిగి బాలయ్యతో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది. తాజాగా మనం సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రియ.. ఆ తర్వాత ఊపిరి సినిమాలో చిన్న అతిథి పాత్రలో కనిపించింది. డైరెక్టర్ క్రిష్, బాలకృష్ణ, చిత్ర నిర్మాత రాజీవ్ రెడ్డి శ్రియానే ఫైనల్ చేయాలనుకున్నట్లు తెలిసింది.
ఇక మొరాకోలో గౌతమీపుత్ర శాతకర్ణి మొదటి షెడ్యూల్ పూర్తయింది. ప్రస్తుతం అమెరికాలో వున్న బాలయ్య బాబు హైదరాబాద్కి తిరిగిరాగానే సిటీలో రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇందులో శ్రియా చరణ్ రాణి పాత్రలో ప్రేక్షకులను మెప్పించనుందని యూనిట్ వర్గాలు వెల్లడించాయి.