శుక్రవారం, 20 జూన్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 11 మే 2016 (11:37 IST)

చిరంజీవి - బాలయ్యల కోసమే గుండు చేయించుకున్నా : వేణు మాధవ్

టాలీవుడ్ కమెడియన్ వేణు మాధవ్‌కు చాలా పెద్ద కష్టమే వచ్చింది. నేను బతికే ఉన్నానని చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ వేణుమాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అందుకు కారణం ఓ టీవీ ఛానల్, కొన్ని సోషల్ సైట్లని మండిపడ్డాడు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న వేణు మాధవ్ ఇక లేరు అని ఓ టీవీ ఛానల్‌లో వచ్చిన వార్తతో వేణు మాధవ్ షాక్ తినడం, ఆ విషయమై కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌కు గుండుతో వచ్చిన వేణుమాధవ్... తనపై జరుగుతున్న నెగెటివ్ ప్రచారాన్ని అడ్డుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
అనంతరం తాను గుండు చేయించుకున్న విషయం గురించి కూడా వేణు మాధవ్ అందరికి పూర్తి క్లారిటీ ఇచ్చాడు. కేన్సర్ లేకపోతే గుండు ఎందుకు చేయించుకున్నావని మీరు అడగొచ్చని... బాలయ్య, చిరంజీవిల కోసమే తాను గుండు చేయించుకున్నానని వేణుమాధవ్ పేర్కొన్నారు. బాలయ్య 100వ సినిమా, చిరంజీవి 150వ సినిమా బాక్సాఫీస్ హిట్టు కొట్టాలని స్వామి వారిని మొక్కుకుని, గుండు చేయించుకున్నానని తెలిపారు. 
 
కొందరు గిట్టనివారు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వేణుమాధవ్ ఆగ్రహం వ్యక్తంచేశాడు. తనకు కేన్సర్, షుగర్, అల్సర్, బీపీ తదితర జబ్బులు ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో సైతం ప్రచారం జరిగిందని ఆవేదన చెందాడు. తనపై చెడు ప్రచారం చేసిన వారందరిపైనా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.