1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 24 జులై 2019 (17:24 IST)

హేమపై గట్టిగా అరిచిన రాహుల్.. ఆగు భయ్ ఆగు.. ఏంటి గట్టిగా అరుస్తున్నావ్?

స్టార్ మాలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ మూడో సీజన్‌ అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రారంభానికి ముందు సినీ నటి గాయత్రి గుప్తా, యాంకర్ శ్వేతారెడ్డి విమర్శలతో వివాదంలో చిక్కుకుంది. దీంతో ప్రస్తుతం స్టార్ మా పోలీసుల నుంచి నోటీసులు కూడా అందుకుంది. అయినప్పటికీ సక్సెస్‌పుల్‌గా బిగ్ బాస్ మూడో సీజన్‌ను కిక్‌గా ప్రారంభించిన నాగార్జున కింగ్‌గా షోను సమర్థవంతంగా నడుపుతున్నాడు. 
 
స్టార్ మా మేనేజ్‌మెంజ్ కూడా విమర్శల మధ్య షోను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తోంది. 15 మందితో కూడిన హౌస్ మేట్స్‌తో ఈ షో జరుగుతోంది. తొలి టాస్క్‌ శివ జ్యోతి, రవి కృష్ణ, అషు రెడ్డి చేశారు. వీళ్ల ఫలితాల ప్రకారం రాహుల్, వరుణ్ సందేశ్, వితికా షిరు, శ్రీముఖి, బాబా భాస్కర్‌, జాఫర్ నామినేషన్ అయ్యారు. 
 
ఆ తర్వాత ఈ ఆరుగురిలో ఎవిక్షన్ ప్రాసెస్ ప్రారంభమైంది. ఎవరు సేవ్ అవుతారు..? ఎవరు నామినేట్ అవుతారు..? ఎవరు ఎలిమినేషన్ అవుతారనేది తెలియాల్సి వుంది. ఇక ఈ ఆరుగురిని పర్యవేక్షించే బాధ్యతలను బిగ్ బాస్ నటి హేమకు ఇచ్చారు. ఈమె వీరి ప్రవర్తనను నోట్ చేసి రిపోర్ట్ ఇస్తారు. ఈ క్రమంలో గత ప్రోమోలో హిమజ హేమకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. 
 
తాజాగా విడుదలైన ప్రోమోలో హేమకు రాహుల్ మధ్య వాగులాట మొదలైంది. ఇక్కడ ఎవరూ టీమ్ లీడర్స్ లేరని వితికా షిరు అంటే.. లీ హేఅమతో వాగులాటకు దిగాడు. తనను మాట్లాడించట్లేదని అలీ అంటే.. అందుకు హేమ వారిస్తుంటే.. ఆగు భయ్ ఆగు అంటూ గట్టిగా అరిచాడు. 
 
అందుకే హేమ ఏంటి అరుస్తున్నావ్ అంటూ అలీ వద్దకు రావడం వరకు ప్రోమో కట్ అయ్యింది. ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని బట్టి ఈ వారం రితికా షిరు, అలీ ఎలిమినేట్ అయ్యే అవకాశం వుందని ఇప్పటికే నెట్టింట చర్చ మొదలైంది.