శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : మంగళవారం, 20 నవంబరు 2018 (18:16 IST)

ముఖ్యమంత్రిపై కారప్పొడి దాడి... ఎక్కడ.. ఎవరు?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కారప్పొడి దాడి జరిగింది. ఢిల్లీలో జరిగిన ఈ దాడిలో ఆయనకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. అయితే, సాక్షాత్తూ ఢిల్లీ సచివాలయంలోనే ఈ దాడి జరగడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. అదేసమయంలో కారప్పొడితో దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 
 
మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ తన ఛాంబర్ నుంచి బయటకు వస్తున్నారు. ఆ సమయంలో కాపుకాచి అక్కడే ఉన్న అనిల్ కుమార్ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో సీఎం చాంబర్ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నంలో తోపులాట కూడా జరిగింది. ఈ ఘర్షణలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కళ్లజోడు కూడా పగిలిపోయింది. 
 
కాగా, నిందితుడు అనిల్ కుమార్ భార్య సచివాలయంలోనే పని చేస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై నిందితుడు ఎందుకు దాడిచేశాడన్నది తెలియడంలేదు. కాగా, ఇది దారుణమైన భద్రతా వైఫల్యమని ఆప్ పార్టీ విమర్శించింది.