Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్పై పడుకున్నాడు.. వీడియో వైరల్
రీల్స్ పిచ్చి పెద్దా చిన్నా లేకుండా అందరికీ బాగా ముదిరిపోయింది. రీల్స్ కోసం సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో వున్నాయి. తాజాగా ఒడిశాలో ఓ బాలుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ప్రమాదకర స్టంట్ చేశాడు. ఆ బాలుడు రైలు వస్తుండగా ట్రాక్పై పడుకున్నాడు.
ట్రైన్ వెళ్లిపోయేవరకూ ట్రాక్పై అతడు అలానే పడుకున్నాడు. అతని సాహసాన్ని అతడి స్నేహితులు వీడియో తీశారు. ఈ వీడియో చూసిన బౌద్ పోలీసులు ముగ్గురు పిల్లలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఈ సంఘటన పురునాపాణి రైల్వే స్టేషన్ సమీపంలోని దలుపాలి సమీపంలో జరిగింది. ఈ ప్రాంతంలో ఇటీవలే రైలు సేవలను ప్రవేశపెట్టారు. పోలీసులతో పాటు నెటిజన్లు కూడా ఈ భద్రతా ఉల్లంఘన ఘటనను ఖండించారు.