శుక్రవారం, 13 మార్చి 2026
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : మంగళవారం, 5 మే 2015 (15:15 IST)

ఈశాన్యం ఎక్కువగా పెరిగినచో శుభఫలితాలే!

ఈశాన్యం ఎక్కువగా పెరిగినచో అట్టి స్థలములో నివశించే వారు ఎక్కువ అదృష్టవంతులు-ఐశ్వర్యం, భోగం కలిగినవారు అయి వుంటారు. ఈశాన్యమున గల స్థలం తగ్గినచో సంతాన నష్టం, ధననష్టం కలుగుతుంది. ఉత్తరంలో కలిసి ఈశాన్యం పెరిగిన స్థలంలో నివశించే వారు పొదుపరులని అర్థం. ఉత్తరం కలిసి ఈశాన్యం పెరిగిన స్థలంలో నివసించే వారు స్థిరచరాస్తి వృద్ధి కలిగి, అధిక భోగభాగ్య సిద్ధిని పొందుతారు. 
 
తూర్పుతో కూడిన ఈశాన్యమూల పెరిగిన స్థలంలో నివశించేవారికి గొప్ప కీర్తి, పుత్ర పౌత్రాభివృద్ధి, ఐశ్వర్యం, వంశవృద్ధి సూచితం. ఈశాన్య స్థలంలో ఉత్తరాన ఎక్కువ ఖాళీ స్థలాన్ని వదిలి, దక్షిణపు పారు చేసి తూర్పు సింహద్వార గృహాన్ని నిర్మిస్తే సమస్త ఐశ్వర్యాలు, వంశవృద్ధి, సంతాన వృద్ధి కలుగుతాయి. 
 
ఈశాన్య స్థలము నందు తూర్పు భాగం ఎక్కువ ఖాళీ స్థలాన్ని విడిచి పశ్చిమపు పారు చేసి, ఉత్తర సింహద్వార గృహాన్ని నిర్మిస్తే సకలైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు.