నదిలో మునిగిన పర్యాటక నౌక: 331కు పెరిగిన మృతుల సంఖ్య
చైనాలోని యాంగ్జీ నదిలో మునిగిన పర్యాటక నౌక ప్రమాదంలో మృతుల సంఖ్య 331కు పెరిగింది. జూన్ 1న సంభవించిన ఈ ప్రమాదంలో ఈస్టర్న్ స్టార్ అనే పర్యాటక నౌకలో ప్రయాణిస్తోన్న 450 మంది నదిలో గల్లంతైన సంగతి తెలిసిందే.
గల్లంతైన వారిలో కేవలం 14 మందిని మాత్రమే సహాయ బృందాలు కాపాడగలిగినట్లు, శనివారం నాటికి 331 మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు చెప్పారు. 149 మర బోట్లు, 59 భారీ యంత్రాలు, ఒక హెలికాప్టర్ల సహాయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని, ఇందులో 3,500 మంది సైనికులు, 1700 మంది పారామిలటరీ పాలుపంచుకుంటున్నట్లు పేర్కొన్నారు.