ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా మంగళవారం బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. ఇటు బ్యాటింగ్.. అటు బౌలింగ్లో సమిష్టిగా రాణించి.. ఈ టోర్నీలో వరుసగా రెండో ఓటమిని చవిచూశారు. ఫలితంగా ఇంగ్లండ్ జట్టు భారత్ నిర్ధేశించిన లక్ష్యాన్ని అలవోకగా చేధిస్తూ.. 9 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది.