ఆరోగ్యంగా ఉండాలంటే.. పీచు పదార్థాలు తీసుకోవాల్సిందే!
ఆరోగ్యంగా ఉండాలంటే.. పీచు పదార్థాలు తీసుకోవాల్సిందే! అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పీచు శాకాహారంలోనే ఉంటుంది. మాంసాహారంలో ఉండదు. పీచుపదార్ధాలు తీసుకున్న ప్రతిసారీ తగినంతగా నీరు కూడా తాగాలి.
పిల్లలకు కూడా పీచు అవసరమేగానీ మరీ పీచుపదార్ధాలే ఎక్కువగా పెడితే.. త్వరగా కడుపునిండినట్లై ఎక్కువ ఆహారం తీసుకోలేరు. దాంతోశక్తి చాలక ఎదుగుదల ప్రభావితం కావచ్చు. కాబట్టి పిల్లలకు పీచు పదార్ధాలు మరీ ఎక్కువ కాకుండా సమతులంగా ఉండేలా చూడాలి.
వీరికి పండ్లు, కూరగాయలు విరివిగా పెడితే ఆ పీచు సరిపోతుంది. సపోటా, అనాస పండ్లలో కాయగూరల్లో ధాన్యాల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. కార్న్లో పీచు పుష్కలంగా ఉంటుంది.
అర కప్పు మొక్కజొన్నలో 2 గ్రాముల ఫైబర్ ఉంటుంది. దీనిలో విటమిన్ B,ముఖ్యంగా థయామిన్ మరియు నియాసిన్ మరియు వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే వైట్ బీన్స్, బ్లాక్ బీన్స్ల్లో పీచు ఉంటుంది.
వోట్స్లో ఉన్న ఫైబర్ రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. జీర్ణక్రియను సాఫీగా ఉంచుతుంది. కొలెస్ట్రాల్ను నియంత్రిస్తుంది. అంతేకాక రోగనిరోధక వ్యవస్థ పనితీరును పెంచటానికి బీటా-గ్లూకాన్ కలిగి ఉంటుంది. వీటితో పాటు పీచు శెనగలు, అవెకాడో, వీట్ బ్రెడ్, బ్రోకోలీ, బ్రౌన్ రైస్, బార్లీ, బాదం, ఆపిల్ పండ్లలో పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.