శనివారం, 19 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 జులై 2022 (14:11 IST)

లైవ్ షోలో డ్యాన్సర్లపై జారిపడిన ఎల్ఈడీ స్క్రీన్

Hong kong
Hong kong
లైవ్ షోలు జరిగేటప్పుడు అప్పుడప్పుడూ ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. తాజాగా హాంకాంగ్‌లో కూడా అలాంటి ప్రమాదమే జరిగింది. 
 
హాంకాంగ్‌లోని ఒక స్టేడియంలో గురువారం సాయంత్రం మిర్రర్ అనే పాప్ బ్యాండ్ ప్రదర్శన జరిగింది. ఈ షోకోసం స్టేజ్‌పై భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 
 
స్టేజ్‌పై డ్యాన్సర్లు డ్యాన్స్ పెర్ఫామ్ చేస్తున్నారు. ఈ సమయంలో ఉన్నట్లుండి ఒక భారీ ఎల్ఈడీ స్క్రీన్ డ్యాన్సర్లపై ఎగిరిపడింది. ఈ ఘటనలో ఇద్దరు డ్యాన్సర్లకు తీవ్ర గాయాలయ్యాయి. 
 
వెంటనే తోటి డ్యాన్సర్లు వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఇద్దరినీ స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.