శుక్రవారం, 20 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : బుధవారం, 11 మే 2016 (11:57 IST)

టెస్ట్ ట్యూబ్ విధానంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన 72 యేళ్ల బామ్మ!

దేశరాజధాని ఢిల్లీలో వింత సంఘటన చోటుచేసుకుంది. మెనోసాజ్ వయసు వచ్చిన మహిళలు గర్భం దాల్చడం వైద్యరంగంలో చాలా అరుదుగా చోటుచేసుకుంటుంది. అలాంటి సంఘటనే ఇక్కడ జరిగింది. ఢిల్లీలో 72 యేళ్ల వయసున్న ఓ బామ్మ టెస్ట్ ట్యూబ్ బేబీకి జన్మనిచ్చింది. పూర్తి వివరాలను పరిశీలిస్తే అమృత్‌సర్‌కు చెందిన మోహిందర్‌సింగ్ గిల్, దల్జిందర్ కౌర్ దంపతులకు టెస్ట్ ట్యూబ్ ప్రక్రియ ద్వారా అబ్బాయి పుట్టాడు. 
 
46 యేళ్ల వైవాహిక జీవితంలో అడుగుపెట్టినప్పటికి, మోనోపాజ్ దశ దాటి 20 యేళ్ళ అయినప్పటికీ సంతానం కావాలన్న ఆ బామ్మ ఆశ 72 ఏండ్లకు నిజమైంది. ఏప్రిల్ 19న ఈ బామ్మ పండంటి మగపబిడ్డకి జన్మనిచ్చింది. 2013 నుంచి రెండుసార్లు ఈ జంట విఫలం చెందగా, మూడోసారి విజయం సాధించింది.