1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 11 నవంబరు 2016 (19:51 IST)

రూ.500, రూ.1000 నోట్లను ప్లేటులో పెట్టి అమ్మేస్తున్నారు.. బిచ్చగాడికిస్తే వద్దన్నాడు

రూ.500, రూ.1000 రూపాయల నోట్ల కేంద్రం రద్దు చేశామని ప్రకటించిన నేపథ్యంలో.. సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి. ప్రధాని మోడీని ప్రశంసిస్తూ కామెంట్లు, లైకులు ఓవైపు.. నోట్ల కోసం ఇబ్బంది ప

రూ.500, రూ.1000 రూపాయల నోట్ల కేంద్రం రద్దు చేశామని ప్రకటించిన నేపథ్యంలో.. సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి. ప్రధాని మోడీని ప్రశంసిస్తూ కామెంట్లు, లైకులు ఓవైపు.. నోట్ల కోసం ఇబ్బంది పడే ప్రజల తంటాలు మరోవైపు. ఇంతేకాకుండా రూ.500 నోట్లను ఇకపై పొట్లాలు చుట్టేందుకు వాడుకోవాల్సిందేనని ఫోటోలు వెల్లువెత్తాయి. 
 
తాజాగా సోషల్ మీడియాలో బిచ్చగాడికి వెయ్యి రూపాయల నోటు దానం చేస్తే దానిని స్వీకరించేందుకు అతను నిరాకరించడం వైరల్ అయ్యింది. మహారాష్ట్రలో ఓ వ్యక్తి ప్లేటులో 500 రూపాయల నోట్లను పెట్టుకుని అరుస్తూ వీధుల్లో అమ్ముతూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఈ వీడియోను ఎవరో కాదు.. బాలీవుడ్ ప్రముఖ నటుడు రితేష్ దేశ్ ముఖ్ పోస్టు చేశాడు.
 
ఈ వీడియోకు గంటలోనే 1.70 లక్షల వ్యూస్ రాగా, రెండు వేల మంది షేర్ చేసుకున్నారు. దీనిపై వివాదాస్పద డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. 'మంచిది సార్‌ అద్భుతాలు జరుగుతున్నాయి. గణపతి బప్పా మోరియా' అని రితేష్‌కు రిప్లై ఇచ్చారు.