1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. tirumala darshan, lord venkateswara, devotee

తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం గంటలోనే.....

tirumala darshan
కలియుగ వైకుంఠుడు శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శన భాగ్యం గంటలోనే భక్తులకు లభిస్తోంది. శుక్రవారం రద్దీగా తిరుమల శనివారం ఖాళీగా కనిపిస్తోంది. సర్వదర్శనంతో పాటు కాలినడక లైన్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. శనివారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 5 కంపార్టుమెంటులోను, కాలినడక భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.
 
కాలినడకతో పాటు సర్వదర్శనం భక్తులకు గంటలోనే దర్శనం పూర్తవుతోంది. శుక్రవారం శ్రీవారిని 68,418 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.34లక్షలుగా వసూలైంది. 
About Writer
ttdj
తర్వాతి కథనం
ప్రతిరోజూ సూర్య నమస్కారం చేయండి... మీ శక్తి పెరుగుతుంది(మౌలాలి. ఎన్- కదిరి)