Lavanya: రాజ్ తరణ్ కేసు కొలిక్కి రాదా? లావణ్యతో మాట్లాడితే ఏంటి ఇబ్బంది? (Video)
హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులను కోకాపేటలోని ఇంట్లోకి రానిచ్చే వ్యవహారంపై లావణ్య పోలీసులను ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి పీఎస్లో రాజ్ తరుణ్ తల్లిదండ్రులపై ఫిర్యాదు చేశారు లావణ్య. రాజ్తరుణ్ తల్లిదండ్రులకు సంబంధించిన వ్యక్తులు తనపై దాడి చేశారని తన ఫిర్యాదులో లావణ్య ఆరోపించారు.
తనపై కుట్ర జరుగుతోందని.. రాజ్తరుణ్ కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందన్న లావణ్య.. రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. రాజ్ తరుణ్తోపాటు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు, శేఖర్ బాషా, ప్రీతీ సహా మరికొంత మందిపై ఫిర్యాదు చేశారు లావణ్య. తనకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం ఆమె నార్సంగి పోలీసులను ఆశ్రయించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి నిమిషం ప్రాణభయంతో బతుకుతున్నానని తెలిపింది. శుక్రవారం కూడా నలుగురు మహిళలు తన ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. తన ప్రాణం పోయాక వారిని పట్టించుకుంటారా అని పోలీసులను లావణ్య ప్రశ్నించారు.
రాజ్ తరుణ్, తాను కలిసి నాలుగేళ్ల క్రితం రూ.55 లక్షలు అప్పు తీసుకున్నాం. గొడవల కారణంగా వడ్డీ చెల్లించలేదు. అప్పు ఇచ్చిన వారు అడుగుతున్నారు. లేకుంటే ఇల్లు స్వాధీనం చేసుకుంటామని చెప్తున్నారు.
వారం రోజులే గడువు. ఒకవేళ రాజ్ రూ.55 లక్షలు చెల్లించినా ఆ పాపర్టీ అతనికి ఇవ్వకూడదని.. అందుతో తన వాటా వుందని లావణ్య అన్నారు. ఇంత జరుగుతున్నా రాజ్ తనతో మాట్లాడట్లేదని లావణ్య తెలిపారు.