'మాస్ మహారాజా' రవితేజ హీరోగా రూపొందుతున్న చిత్రం `టచ్ చేసి చూడు`. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బేబీ భవ్య సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాలో రాశీఖన్నా లావణ్య త్రిపాఠి కథానాయికలు.