1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 జూన్ 2025 (19:24 IST)

సింగపూర్ నుంచి హైదరాబాదుకు మార్క్ శంకర్- ICRISATని సందర్శించిన పవన్

Pawan Kalyan
Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం పటాన్‌చెరులోని ఇక్రిసాట్ క్యాంపస్‌లో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్‌లో తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌ను చేర్చుకోవడానికి ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెమీ-ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT)ని సందర్శించారు.
 
గత విద్యా సంవత్సరం వరకు సింగపూర్‌లో చదువుతున్న మార్క్ శంకర్ (8) అగ్ని ప్రమాదంలో కాలిన గాయాలతో బాధపడ్డాడు. ఈ ప్రమాదం తర్వాత పవన్ కల్యాణ్ మార్క్ శంకర్‌ను భారతదేశానికి తీసుకువచ్చారు. ఆ తర్వాత హైదరాబాదు స్కూలులోనే చేర్చేందుకు నిర్ణయించుకున్నారు. 
 
ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్‌‌ను సందర్శించారు. అక్కడి సౌకర్యాలు, బోధనపై జనసేనాని స్కూల్ సిబ్బంది, అధ్యాపకులతో అడిగి తెలుసుకున్నారు.