మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"
నూతన నిర్మాణ సంస్థ రమాదేవి ప్రొడక్షన్స్ ద్వారా రూపొందుతున్న వైభవం చిత్రం మే 23, 2025న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. రుత్విక్, ఇక్రా ఇద్రిసి హీరో హీరోయిన్లుగా పరిచయంకానున్న ఈ చిత్రంలో ఒక ప్రత్యేక కాస్టింగ్ కాల్ ద్వారా ఎంపిక చేయబడిన ఎంతో మంది ప్రతిభావంతులైన నటులు ఇతర పాత్రల్లో కనిపిస్తారు. ఇటీవలే సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది.
ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్కు సెన్సార్ బోర్డ్ నుండి ఇటీవలకాలంలో అరుదైపోయిన క్లీన్ యూ సర్టిఫికెట్ లభించింది. ఇదివరకే విడుదలైన రెండు పాటలకీ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిందని మేకర్స్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మంచి సినిమాలని ఆదరిచడంలో తెలుగు ప్రేక్షకులు ఎల్లవేళలా ముందుంటారన్న సంగతి మరోసారి ఈ చిత్రంతో నిరూపితమవుతుందని దర్శకుడు సాత్విక్ తెలిపారు.