తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం వేదం. ఈ చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు నటుడుగా పరిచయమైన నాగయ్య. దీంతో ఆయన పేరు వేదం నాగయ్యగా మారిపోయింది. ఈయన శనివారం కన్నుమూశారు. గుంటూరు జిల్లా, నరసరావుపేట సమీపంలోని దేసవరం పేట గ్రామ వాసి. సొంత గ్రామంలో పని దొరకకపోవడంతో కొడుకుతో కలిసి హైదరాబాద్కు వచ్చారు. అక్కడ కూలిపని చేసుకుంటుంటే సినిమా అవకాశం వచ్చింది.