మంగళవారం, 17 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 జూన్ 2025 (22:21 IST)

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

Doctor Family
Doctor Family
Doctor Family
Doctor Family
అహ్మదాబాద్‌లో జరిగిన విధ్వంసకర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారిలో రాజస్థాన్‌కు చెందిన ప్రతీక్ జోషి, ఆయన భార్య డాక్టర్ కోమి వ్యాస్, వారి ముగ్గురు పిల్లలు ప్రద్యుత్ జోషి, మిరాయ జోషి, నకుల్ జోషి ఉన్నారు. సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ అయిన జోషి గత ఆరు సంవత్సరాలుగా లండన్‌లో నివసిస్తున్నారు. తన కుటుంబంతో శాశ్వతంగా అక్కడే స్థిరపడాలని చాలా కాలంగా భావించారు. 
 
డాక్టర్ కోని వ్యాస్ ఉదయపూర్‌లోని పసిఫిక్ హాస్పిటల్‌లో పనిచేశారు. తన ఉద్యోగాన్ని వదిలి తన భర్తతో లండన్‌లో స్థిరపడ్డారు. ఈ విషాదకరమైన ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన మొత్తం 10 మంది మరణించినట్లు సమాచారం.
 
ఎయిర్ ఇండియా విమానం నుండి ఆ కుటుంబం తీసుకున్న చివరి సెల్ఫీ బయటకు వచ్చింది. చిత్రంలో, మొత్తం కుటుంబం హాయిగా నవ్వుతూ కనిపించడం కనిపిస్తుంది. మృతుడి కుటుంబ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం గురువారం అహ్మదాబాద్ విమానాశ్రయానికి సమీపంలోని మేఘనినగర్ ప్రాంతంలో కూలిపోయింది.
 
ఈ ఘోర విమాన ప్రమాదం నుండి ఒక ప్రయాణీకుడు అనూహ్యంగా బయటపడ్డాడు. ఆ ప్రయాణీకుడిని విశ్వాస్ కుమార్ రమేష్ (38) గా గుర్తించారు. ఆ ఘోర విమాన ప్రమాదం నుండి ఆ ప్రయాణీకుడు ప్రాణాలతో బయటపడ్డాడు.