ఏపీలో కరోనా ఉద్ధృతి... 114 మంది మృతి..

Written By సెల్వి
Updated: గురువారం, 20 మే 2021 (18:48 IST)
ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1,01,281 కరోనా టెస్టులు చేయగా, 22,610 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 15,21,142కి చేరింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కరోనా ధాటికి 114మంది చనిపోయారు. దీనితో మరణాల సంఖ్య 9,800కి పెరిగింది. 
 
మరోవైపు 23,098 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,09,134 యాక్టివ్‌ కేసులున్నాయి. కాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,83,42,918 కరోనా టెస్టులు చేశారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

అన్నీ చూడండి

విజయ్ నటించిన జననాయగన్‌ను తల్లితో కలిసి వీక్షించిన త్రిష

Romanchakam :సందీప్ రెడ్డి వంగా సమర్పణలో రోమాంచకం రాబోతోంది

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఫైనల్.. ట్రైలర్ విడుదల

Jana Nayakudu review :ఇద్దరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ల కథతో జన నాయకుడు..రివ్యూ

ఆ ఒక్క కారణంతో బిగ్ బాస్ అవకాశాన్ని వదులుకున్నా : సత్యశ్రీ

తర్వాతి కథనం
Show comments