రాష్ట్ర సంపదపై దాడి చేస్తున్నారు: చంద్రబాబు

సోమవారం, 9 ఆగస్టు 2021 (08:41 IST)
600 రోజులుగా సాగుతున్న రైతుల పోరాటం ఒక చరిత్ర అని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజా రాజధానికి రైతులు 32,323 ఎకరాలు త్యాగం చేశారని చెప్పారు.

రైతులు, రైతు కూలీల న్యాయపోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. అమరావతి ఆంధ్రుల రాజధాని మాత్రమే కాదన్నారు. ఆంధ్రులకు రూ. 2 లక్షల కోట్ల సంపద సృష్టించే కేంద్రం అమరావతి అన్నారు.

వైసీపీ చేస్తున్నది అమరావతిపై దాడి కాదు.. రాష్ట్ర సంపదపై దాడి చేస్తున్నారని చెప్పారు. విద్వేషంతో ప్రజా రాజధానిని జగన్‌ ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు.

జగన్‌ వల్ల 139 సంస్థలు అమరావతి ప్రాజెక్టు నుంచి వెనక్కి వెళ్లాయని చెప్పారు. అమరావతి అంతానికి వైసీపీ ప్రభుత్వం చేయని కుట్ర లేదన్నారు. ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే.. మరింత ఉద్ధృతమైందని హెచ్చరించారు.

అన్నీ చూడండి

ఖుష్బూ కుమార్తె పెళ్లికి త్రిష, ఖాళీగా పక్కసీటు, అది ఎవరికోసం?

Sree Vishnu: ఫస్ట్ 25 టికెట్స్ ఎవరు కొంటే వారికి మరొక టికెట్ ఫ్రీ ఇస్తాం :శ్రీవిష్ణు

Kajal Aggarwal :పురుగు మందుల పేరుతో జరిగే అన్యాయాలపై లాయర్ పోరాటమే ది ఇండియా స్టోరీ

Aishwarya Rajesh :ఇసకపట్నం పై ఆధిపత్యం చేసే సముద్రఖని కి సవాల్ గా మారిన ఐశ్వర్య రాజేష్

Tatvam trailer: మర్డర్ మిస్టరీ, ఇన్వస్టిగేషన్‌ థ్రిల్లర్‌ గా తత్వం ట్రైలర్‌

తర్వాతి కథనం
Show comments