1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (14:17 IST)

#BudgetSession2019 : ఏపీకి మోడీ మొండిచేయి : రైల్వే జోన్ ఊసేలేదు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మళ్లీ హ్యాండిచ్చింది. విభజన హామీ మేరకు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించాల్సి వుంది. కానీ, శుక్రవారం కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఈ రైల్వేజోన్ అంశాన్ని ఆయన మాట మాత్రం కూడా ప్రస్తావించలేదు. 
 
ఆయన తన బడ్జెట్ ప్రసంగంలో విశాఖ రైల్వే జోన్ మాట్లాడలేదు కదా., కడప ఉక్కు ఫ్యాక్టరీకి కూడా ఒక్క పైసాకూడా కేటాయించలేదు. కనీసం ఈ బడ్జెట్‌లోనైనా ఆంధ్రప్రదేశ్‌కు రాయితీలు, రైల్వేజోన్‌ వచ్చే అవకాశం ఉందంటూ.. రెండు మూడు రోజులుగా కొందరు బీజేపీ నేతలు హడావుడి చేశారు. ఇప్పుదంతా వట్టిదేనని తేలిపోయింది. 
 
ఈ బడ్జెట్‌లో కూడా తెలుగు రాష్ట్రాలకు మళ్లీ నిరాసే ఎదురైంది. ముఖ్యమైన ప్రాజెక్టులకు ఎలాంటి కేటాయింపులు కనిపించలేదు. ఏపీకి మరోసారి మోడీ తీవ్ర అన్యాయం చేశారు. ఇది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ.. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్దిచేకూర్చేలా తాయిలాలు ప్రకటించిన ప్రధాని మోడీ సర్కారు.. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాత్రం ఆదుకునేందుకు ఏమాత్రం ఆసక్తిచూపలేదని చెప్పొచ్చు.