కాపులకు రిజర్వేషన్లు రావడం సాధ్యం కాదా.. ఎందుకు?

కాపు, బలిజ, ఒంటరి, తెలగ వారందరినీ బిసిల్లో చేర్చడమే కాకుండా ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఎపి మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కాపులు కృతజ్ఞతలు చెబుతున్నారు. కొన్ని చోట్ల ముఖ్యమంత్రికి పాలాభిషేకాలు కూడ

Written By TJ
Updated: మంగళవారం, 5 డిశెంబరు 2017 (13:30 IST)
కాపు, బలిజ, ఒంటరి, తెలగ వారందరినీ బిసిల్లో చేర్చడమే కాకుండా ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఎపి మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కాపులు కృతజ్ఞతలు చెబుతున్నారు. కొన్ని చోట్ల ముఖ్యమంత్రికి పాలాభిషేకాలు కూడా చేశారు. అయితే కాపులకు రిజర్వేషన్లు రావడం చాలా కష్టమన్న విషయం చాలా మందికి తెలియదు. ఎపి ప్రభుత్వం తీర్మానించి పంపిన ఈ రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీస్ సిగ్నల్ ఇవ్వడం ఏ విధంగానూ సాధ్యం కాదు.
 
ఎందుకంటే రాజ్యాంగ సవరణ జరగాలి. 9వ షెడ్యూల్ మార్చాలి. పార్లమెంటులో ఆమోదముద్ర లభించాలి. ఇదంతా సాధ్యమవ్వడం కల్లే. రాజ్యాంగాన్ని మార్చడం చాలా కష్టం. ఇప్పటికే బిసీల్లో 141కిపైగా కులాలు ఉంటే కొత్తగా మరో నాలుగింటిని ప్రభుత్వం అందులో చేర్చడం బిసిలకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఇదొక రకమైన పోరాటం జరుగుతోంది. అంతే కాదు 20కిపైగా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఏర్పడితే కేంద్రం చేతులు కట్టుకుని గమ్మని జరుగుతున్నదాన్ని చూస్తూ కూర్చుంది. 
 
అలాంటిది ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక తీర్మానం చేసి పంపిన వాటిని కేంద్రం ఆమోదం ఇస్తుందనుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను సాధ్యం కాదని తెలుస్తోంది. కర్ర విరగకుండా, పాము చావకుండా చంద్రబాబు ఎంతో ముందు ఆలోచనతో కాపులకు రిజర్వేషన్లు ప్రకటించారు గాని, అది కాస్త కేంద్రంలో ఆమోదం లభించడమనేది ఎట్టి పరిస్థితుల్లోను సాధ్యం కాదు.

అన్నీ చూడండి

బోరున విలపించిన కోలీవుడ్ నటి : ఎందుకో తెలుసా?

Manchu Lakshmi: సంప్రదాయ బోధనే చిన్నారుల ఎదుగులకు పునాది :మంచు లక్ష్మి

అందుకే బెనాక గోల్డ్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వున్నా : నాగబాబు

పెయిడ్ ప్రీమియర్స్ తో 3.13 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన చెన్నై లవ్ స్టోరీ

వంద దేవుళ్ళు మూవీని స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించిన జీతెలుగు

తర్వాతి కథనం
Show comments