మున్సిపల్ కమిషనర్‌గా సీఎం జగన్?

బుధవారం, 2 అక్టోబరు 2019 (16:08 IST)
ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను మున్సిపల్ కమిషనర్‌గా మార్చేశారు. పార్వతీపురం పురపాలక శాఖ తప్పిదం జనాలకు నవ్వులాటగా మారింది.

వార్డు సచివాలయం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పార్వతీపురం మున్సిపల్ కమిషనర్‌ స్థానంలో ముఖ్యమంత్రి జగన్ ఫొటో పెట్టారు. అంతే కాకుండా ప్రత్యేక అధికారిగా ఎమ్మెల్యే జోగారావు ఫోటోను పెట్టారు. ఈ ఫ్లెక్సీని వార్డు సచివాలయం ముందు ఏర్పాటు చేశారు.

దీంతో ఫ్లెక్సీని చూసిన జనాలు నవ్వుకుంటున్నారు. అనంతరం తప్పిదం తెలసుకున్న మున్సిపల్ అధికారులు.. వెంటనే ఫ్లెక్సీని తొలగించారు.

ఇదిలా వుండగా తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం పెద రాయవరం గ్రామ సచివాలయంపై ఉన్న సీఎం జగన్మోహన్‌రెడ్డి బొమ్మపై రంగుపూసిన పెదరాయవరం గ్రామానికి చెందిన కొట్టు సూరిబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని స్టేషన్‌కు తరలించామని ఎస్‌ఐ తెలిపారు.

అన్నీ చూడండి

టాటా ప్లే బింజ్‌లోకి ఈటీవీ విన్: ఇక జాతీయ స్థాయిలో తెలుగు హిట్ చిత్రాలు

విమానాశ్రయంలో ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్: వీళ్లిద్దరూ పెళ్లి చేస్కుంటారని పుకార్లు, వీడియో

ప్రదీప్, మమిత లవ్వులో వున్నారా? పెళ్లి చేసుకోబోతున్నారట!

Victory Venkatesh :అనిల్ రావిపూడి చిత్రం షూటింగ్‌లో జాయిన్ అయిన విక్టరీ వెంకటేష్

Chiru158: హైదరాబాద్‌లో శమెగాస్టార్ చిరంజీవి 158 చిత్రం భారీ యాక్షన్ షెడ్యూల్

తర్వాతి కథనం
Show comments