Cow attack: ఏపీలో ఆవుల దాడి.. ఒకరు మృతి.. మరొకరికి తీవ్రగాయాలు (video)
ఏపీలో దారుణం చోటుచేసుకుంటుంది. ఇద్దరు వ్యక్తులపై ఆవులు దాడి చేశాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. మరొకరికి తీవ్రగాయాలైనాయి. వివరాల్లోకి వెళితే.. తిరుపతి, వేలూరు బస్టాండ్ సమీపంలో లక్ష్మీ కేఫ్ వద్ద ఆవులు నిలిచివున్నాయి. అదే సమయంలో బైకుపై ఇద్దరి వ్యక్తులు అక్కడ చేరుకున్నారు.
బైకు వెనుక కూర్చున్న వ్యక్తి బైకు దిగుతుండగా పక్కనే వున్న ఆవు అతడిపై దాడి చేసింది. పక్కనే వున్న మరో ఆవు కూడా అతడిపై దాడి చేసింది. స్థానికులు ఆవులను దాడి చేయకుండా ప్రయత్నం చేశారు. కానీ ఆవులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.