చేపల కోసం వల వేస్తే కొండచిలువ పడింది

మంగళవారం, 11 ఆగస్టు 2020 (10:49 IST)
పుట్టెడు ఆశతో చేపలకు వెళ్లారు కొంతమంది యువకులు.. చాలా కాలం తర్వాత వేటకు వెళ్లడం వల్ల పట్టుకున్నన్ని చేపలు గ్యారెంటీ అనుకున్నారు. కానీ చేపల సంగతేమోగానీ.. వారికి భారీ కొండచిలువ పట్టుబడింది.
 
 మంగళవారం ఉదయం సమీపంలోని కొండవీటి వాగుకు వెళ్లిన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన యువకులు ఇది చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

చేపల కోసం వారు విసిరిన వలలో దాదాపు పది అడుగుల కొండ చిలువ పడింది. తొలుత చేప పడి ఉంటుందని భావించిన యువకులు నీటిలోనుంచి వలను బయటకు లాగగా  వలలో కొండచిలువ ప్రత్యక్షమైంది. అనంతరం వారు దానిని చంపేశారు. ఈ కొండ చిలువను చూడడానికి స్థానిక గ్రామస్తులు ఎగబడ్డారు.

అన్నీ చూడండి

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments