శనివారం, 28 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 డిశెంబరు 2021 (08:32 IST)

విశాఖ మధురవాడలో రోడ్డు ప్రమాదం - ముగ్గురు మృతి

విశాఖపట్టణం జిల్లా మధురవాడలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఓ చిన్నారి కూడా ఉంది. మృతుల వివరాలు తెలియాల్సివుంది. 
 
ఈ ప్రమాదం చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై ఒక ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం గురించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.