Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 నుంచి ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Written By ఎం
Updated: బుధవారం, 14 అక్టోబరు 2020 (20:41 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆలయంలోనే ఏకాంతంగా జరగనున్నాయి. ఈ ఏడాది అధికమాసం కావడంతో స్వామివారికి రెండు సార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు.

గత నెలలో నిర్వహించిన వార్షిక ఉత్సవాలను ఏకాంతంగా ఆలయంలోనే నిర్వహించిన తితిదే.. ఈ నెల 16 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న నవరాత్రి ఉత్సవాలను తిరువీధుల్లో భక్తుల మధ్య నిర్వహించాలని ముందుగా భావించి అందుకు తగిన ఏర్పాట్లు చేసింది.

అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా వెల్లడించిన కొవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా నవరాత్రి ఉత్సవాలను ఈసారి కూడా  ఏకాంతంగానే నిర్వహించనునన్నట్లు మంగళవారం తితిదే ప్రకటించింది. ఈవో జవహర్‌రెడ్డి అధ్యక్షతన తితిదే ఉన్నతాధికారులు పలు మార్లు సమీక్షలు నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తితిదే తెలిపింది.

చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతుండటం.. ఉత్సవాలు, మతపరమైన కార్యక్రమాలకు 200 మందికి మించి నిర్వహించకూడదని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు  స్పష్టం చేశారు.

అన్నీ చూడండి

రాణి పద్మావతి పిరికిపందనా? నటి స్వర భాస్కర్‌పై బీజేపీ - కర్ణిసేన పైర్

దర్శకుడు సాయి రాజేష్ ఆవిష్కరించిన డియర్ హార్ట్ మోషన్ పోస్టర్

రూ.200 కోట్ల క్లబ్‌లో రవితేజ 'ఇరుముడి' చిత్రం

ఆది సాయికుమార్ క్లాప్ తో ప్రారంభమైన ఇ.ఎం.ఐ. చిత్రం

ఇరుముడి లాంటి విజయం దశాబ్దానికి ఒకసారి వస్తుంది : నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్

తర్వాతి కథనం
Show comments