1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 5 మే 2017 (17:00 IST)

భార్య ఇంకొకరితో... వెన్నులో పొడిచి ముక్కలుగా నరికేశాడు...

అనుమానం పెనుభూతంగా మారుతోంది. భార్యపై అనుమానం పెంచుకుంటున్న భర్తలు వారిని విచక్షణా రహితంగా చంపేస్తున్నారు. అలాంటి ఘటనే చిత్తూరు జిల్లాలో జరిగింది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ముత్తుకూరు గ్రామంలో మునస్వామి ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. మునస్వామి భా

అనుమానం పెనుభూతంగా మారుతోంది. భార్యపై అనుమానం పెంచుకుంటున్న భర్తలు వారిని విచక్షణా రహితంగా చంపేస్తున్నారు. అలాంటి ఘటనే చిత్తూరు జిల్లాలో జరిగింది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ముత్తుకూరు గ్రామంలో మునస్వామి ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. మునస్వామి భార్య లక్ష్మీదేవి. ఇంటి వద్దనే ఉంటోంది. వీరికి పిల్లలు లేరు. పిల్లలు లేకున్నా ఈ దంపతులు అన్యోన్యంగా ఉండేవారు.
 
అయితే గత కొన్ని రోజులుగా భార్య లక్ష్మీదేవిపై అనుమానం పెంచుకున్నాడు మునస్వామి. భార్య వేరొకరితో సంబంధం పెట్టుకుందని కోపంతో రగిలిపోయాడు. నిన్న అర్థరాత్రి నిద్రించే సమయంలో లక్ష్మీదేవిని వీపుపై ముందుగా పొడిచాడు. ఆమె చనిపోయిందనుకుని నిర్ధారించుకున్న తర్వాత ముక్కలు ముక్కలుగా నరికాడు. అలా తన భార్యను నరికేసిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిత్తూరులో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టిస్తోంది.