1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (15:05 IST)

28న విశాఖపట్టణానికి సీఎం జగన్ టూర్

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పర్యటనల ద్వారా ప్రజలకు మరింతగా దగ్గరయ్యేలా ఆయన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులోభాగంగా, ఆయన ఈ నెల 28వ తేదీన విశాఖపట్టణ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. 
 
విశాఖ నగర శివారు ప్రాంతంలో ఒకేచోట 72 లే అవుట్లను అధికారులు సిద్ధం చేశారు. మొత్తం 300 ఎకరాల మేర విస్తీర్ణంలో 9 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఈ ఇళ్ళ స్థలాల పట్టాలను వాటి లబ్దిదారులకు సీఎం జగన్ చేతుల మీదుగా అందజేయనున్నారు.