1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 7 జూన్ 2020 (19:11 IST)

మచిలీపట్నం అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి సహాయం

మచిలీపట్నం నియోజకవర్గం భోగిరెడ్డిపల్లి గ్రామం అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ఆదివారం మచిలీపట్నం జనసేన పార్టీ మరియు లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ చేయూత అందించింది.

శనివారం భోగిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో కౌలు రైతు ముద్దినేని వీర వెంకటేశ్వరరావు  చెందిన ఇంటిలో జరిగిన ప్రమాదంలో  4లక్షల ఆస్తి నష్టం జరిగింది,2లక్షల రూపాయలు ఖరీదు చేసే  మినుములు చేసే  అగ్నికి ఆహుతి అయ్యింది.

బాధిత కుటుంబానికి నెలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులు, వంట సామగ్రి, కూరగాయలు, బట్టలు, మరియు 10000 రూపాయలు ఆర్ధిక సహాయం అందచేశారు. నష్టపోయిన రైతు కుటుంబానికి సి.ఎం రిలీఫ్ ఫండ్ నుండి ఆర్ధిక సహాయం అందచేయాలని జనసేన పార్టీ నాయకులు కోరారు.

కాలిపోయిన మినుములు ప్రభుత్వ కోనుగోలు కేంద్రం ద్వారా కొనుగోలు చేసి రైతుని ఆదుకోవాలని జనసేన నాయకులు కోరారు..కరోన విపత్కర పరిస్థితుల్లో బోగిరెడ్డిపల్లి అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మచిలీపట్నం జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ ,లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ కన్వీనర్,అడ్వొకేట్ లంకిశెట్టి బాలాజీ,జనసేన పార్టీ మండల,నగర పార్టీ అధ్యక్షుడు గళ్ళ తిమోతి,గడ్డం రాజు జనసేన నాయకులు ఒంపుగడవల చౌదరి,చెక్రీ, బోగిరెడ్డిపల్లి మురళి,k. వెంకటేశ్వరరావు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు