మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2014 (12:47 IST)

ముగ్గులేసే మహిళలే టార్గెట్: రెచ్చిపోతున్న చైన్ స్నాచర్స్!

చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం. తెల్లవారుజామున లేచిన మహిళలు ఇళ్ళ ముందు ముగ్గులేసే మహిళలనే టార్గెట్ చేసుకున్నారు. అలాంటి మహిళలే టార్గెట్‌గా చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. 
 
పట్టణ పరిధిలోని మాచవరం, హౌసింగ్ బోర్డు కాలని, ఇంగ్లిష్ పాలెం, కలెక్టరేట్ ప్రాంతాల్లో మహిళల మెడల నుంచి బంగారు చైన్లను లాక్కుపోయారు.
 
అరగంట వ్యవధిలో 6 చోట్ల దొంగలు తెగబడ్డారు. కేసులు నమోదు చేసి దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.