సంబంధిత వార్తలు
- చంద్రబాబు పిల్లిలా అరిస్తే పులిలా గాండ్రించారని రాస్తారా?
- క్విడ్ ప్రోకోకి రివర్స్ టెండరింగ్ అని కొత్త పేరు పెట్టావా..? శకుని మామా?
- ఏపీ ప్రజలు అప్పుడే జగన్ ప్రభుత్వంపై అసంతృప్తిగా వున్నారా? విశాఖ వైసీపి ఎమ్మెల్యేలు ఎందుకలా?
- వేణుమాధవ్ మృతి.. పవన్ కల్యాణ్, చంద్రబాబు దిగ్భ్రాంతి..
- వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పాట వచ్చేసింది. ఇక సంచలనమే..! (video)
వైసీపీ ప్రభుత్వం ఏపీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది: చంద్రబాబు
గుంటూరు : వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తోందని టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పీపీఏలపై జగన్ ప్రభుత్వానివి తప్పుడు నిర్ణయాలని ఆరోపించారు. టీడీపీ హయంలో జెన్కో, ట్రాన్స్కోను దేశంలోనే నెంబర్ వన్ చేశామన్నారు. సంస్కరణలతో కరెంట్ కోతలను అధిగమించామన్నారు.
డిస్కంలకు అప్పులు లేకుండా చేశామని, కరెంట్ కోతల నుంచి మిగులు విద్యుత్ సాధించామని చంద్రబాబు చెప్పారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీనేనని ఆయన స్పష్టం చేశారు. నాణ్యమైన, తక్కువ ధరకు కరెంట్ ఇవ్వాలని ముందుకెళ్లామని, దురుద్దేశంతోనే విద్యుత్ ఒప్పందాలు జరిగాయని ఎలా అంటారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
