మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 16 అక్టోబరు 2014 (14:06 IST)

పవన్ కళ్యాణ్‌ది గొప్ప మనస్సు.. ఎపుడూ ముందుంటారు : చంద్రబాబు

విపత్తుల సమయంలో బాధితులను ఆదుకోవడంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎప్పుడూ ముందుంటారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. హుదూద్ తుఫాను బాధితుల కోసం పవన్ కళ్యాణ్ ప్రకటించిన రూ.50 లక్షల చెక్కును గురువారం వైజాగ్‌లో చంద్రబాబుకు ఆయన అందజేశారు. 
 
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో కలిసి చంద్రబాబు మాట్లాడుతూ... తుపాన్ బాధితులను ఆదుకోవడం అందరూ సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. ఖర్చులు ఎంతైనా ఫర్వావాలేదు... ప్రజల బాధలు తీరాలనేదే తన లక్ష్యమన్నారు. హుదూద్ తుఫానుకు ఆర్థిక సాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నాని తెలిపారు. 
 
బంగాళదుంపల కోసం బెంగాల్ సీఎంతో మూడుసార్లు మాట్లాడినట్లు చంద్రబాబు వివరించారు. నేటి నుంచి తుఫాను సహాయ కార్యక్రమాలు అన్ని తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్ కొరత తీరిందన్నారు. విశాఖ ప్రజల్లో ఆత్మస్థైర్యం కలిగించామన్నారు.