1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 డిశెంబరు 2019 (13:42 IST)

హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు.. మగ పోలీసులు విటులుగా వెళ్తే..?

హైటెక్ వ్యభిచారం గుట్టును పోలీసులు రట్టు చేశారు. మగ పోలీసులు విటులుగా వెళ్తే.. వారికి అండగా మఫ్టీలో ఆడ పోలీసులు వెళ్లి అసలు బాగోతాన్ని బయటపెట్టారు. నలుగురు యువతులను, ఓ విటుడిని పట్టుకున్నారు. చిత్తూరు మరకంబట్టు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మరకంబట్టు కేంద్రంగా ఓ మహిళ ఈ వ్యభిచార కేంద్రాన్ని నడుపుతోంది. 
 
చిత్తూరు, తిరుపతి నగరాలకు చెందిన పలువురు యువతులను డబ్బు ఆశచూపి ఈ కూపంలోకి లాగేది. వీరి వివరాలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసి, ధర కూడా ఉంచేది. ఈ విధంగా యువతిని బట్టి రూ.ఐదు వేల నుంచి రూ.30 వేల వరకు ధర నిర్ణయించేది. 
 
స్థానికంగా ఉన్న ఈ యువతులను కళాశాల విద్యార్థులు అనుకుని చాలా రోజులు స్థానికులు పట్టించుకోలేదు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి వీరి వ్యవహారశైలిపై అనుమానం వచ్చి ఎస్పీకి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు పోలీసులు వల వేసి ముఠా గుట్టు రట్టు చేశారు.