30 వరకు లాక్‌డౌన్‌ కొనసాగించండి: కన్నా డిమాండ్

సోమవారం, 13 ఏప్రియల్ 2020 (08:06 IST)
ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ ఈ నెల 30 వరకూ కొనసాగించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సిఎం జగన్‌కు లేఖ రాశారు.

కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ సడలించడమే మేలని వ్యాఖ్యానించారు. భారత్‌లో లాక్‌డౌన్‌ విధించి కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను చాలా దేశాలతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ అభినందించిందని పేర్కొన్నారు.

ఇప్పటికే లాక్‌డౌన్‌ పొడిగించాలని ఒడిసా, తెలంగాణాతో పాటు మరికొన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయని వివరించారు.

లాక్‌డౌన్‌ కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయాలనుకోవడం సరికాదన్నారు. లాక్‌డౌన్‌ వల్ల ఆర్థికవ్యవస్థ దెబ్బతింటున్నప్పటికీ ప్రజల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని హితవు పలికారు.

అన్నీ చూడండి

NTR Clarity: ఎన్.టి.ఆర్.పై వస్తున్న వార్తలకు ఎన్టీఆర్ కార్యాలయం వివరణ

Kalki 2 update: కల్కి సీక్వెల్ అప్‌డేట్, భారతాన్ని వక్రీకరిస్తున్న నాగ్ అశ్విన్ !

Balakrishna: తారక్ (జూ.ఎన్.టి.ఆర్.) రాజకీయ ప్రవేశంపై బాలక్రిష్ణ స్పందన హైలైట్

Sandeep Reddy Vanga: సత్యదేవ్ నటన సంచలనాత్మకం : రావు బహదూర్ పై సందీప్ రెడ్డి వంగా రివ్యూ

కోలీవుడ్‌లో తండ్రీతనయుల పోటీ.. చివరకు వెనక్కి తగ్గిన కుమారుడు...

తర్వాతి కథనం
Show comments